రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పరిస్థితుల్లో పలువురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కూడా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులకు సహాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీతో పాటుగా తెలంగాణ సెక్రెటేరియట్ లలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని, ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులకు/వలసదారులుకు సాధ్యమైన అన్ని విధాల మద్దతును అందించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో హెల్ప్ లైన్ సెంటర్:
- విక్రమ్ సింగ్ మన్ ఐపీఎస్ : +91 7042566955
- చక్రవర్తి పీఆర్ఓ : +91 9949351270
- నితిన్ ఓఎస్డీ : +91 9654663661
- ఈ-మెయిల్ ఐడీ : [email protected]
తెలంగాణ సెక్రెటేరియట్ లో హెల్ప్ లైన్ సెంటర్ :
- ఈ.చిట్టిబాబు ఏఎస్ఓ : 040-23220603 , ఫోన్ నంబర్ : +91 9440854433
- ఈ-మెయిల్ ఐడీ : [email protected]
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ