నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యాలయంలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమయిన అధికారులు అస్వస్థతకు గురయిన విద్యార్థులకు కొందరికి అక్కడే చికిత్స అందించగా, మరికొందరిని నవీపేట్, నిజామాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు, వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ లతో మాట్లాడి, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని ఆదేశించారు.
అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మరోవైపు విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందేలా దగ్గరుండి పర్యవేక్షించాలని ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY