తెలంగాణలోని సింగరేణి కాలరీస్ సంస్థ శనివారం 103వ ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటోంది. డిసెంబర్ 23, 1920న ఈ సంస్థకు ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ అని నామకరణం జరగడంతో, అప్పటినుంచి అదే తేదీన ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం అయిన ‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం’ (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్మికులు, ఉద్యోగులు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ వేదికగా ఒక సందేశం ఇచ్చారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో, లాభాల్లో, కార్మికుల సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు.
బొగ్గు ఉత్పత్తిలో రారాజు, తెలంగాణ సిరులవేణి, 102 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతున్న మన నల్ల బంగారం సింగరేణి సంస్థ 103 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు.
1/2 pic.twitter.com/vfx93rcvOf— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 23, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ