తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం భోగి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గంగిరెద్దుల ఆటలు, కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పల్లె వాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చిన హైదరాబాద్ జాగృతి బృందానికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, దీనిలో భాగంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో తొలి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇక భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను తెలుగు ప్రజలందరం ఘనంగా జరుపుకుంటామని, భోగి మంటలో పాత ఆలోచనలన్నింటినీ మేళవించి కొత్త ఆలోచనలతో ముందుకు సాగడమే ఈ పండుగ ఉద్దేశమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE