నారావారి పల్లిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. భోగి మంటల్లో జీవో నం.1 ప్రతులు

TDP Chief Chandrababu Naidu Burns The Copies of GO.1 in Bhogi Flames at Naravaripalle Today, Bhogi Flames at Naravaripalle, TDP Chief Chandrababu Naidu Burns The Copies of GO.1, GO.1 in Bhogi Flames at Naravaripalle, TDP Chief Nara Chandrababu Naidu, GO.1 Copies, Naravaripalle Bhogi Flames, Sankranti Celebrations 2023, 2023 Sankranti Celebrations, Sankranti Celebrations, Mango News, Mango News Telugu

సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా మూడేళ్ళ తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం జరిగిన ఈ వేడుకల్లో ఆయనతో పాటు పలువురు గ్రామస్తులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్.1 ప్రతులను పార్టీ నేతలతో కలిసి భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. తద్వారా జీవో నెంబర్.1పై నిరసనను తెలియజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. భోగి మంటల్లో పాత వస్తువులను, పనికిరాని వాటిని వేయడం సంప్రదాయమని.. అందుకే ప్రజలకు ఉపయోగపడని ఈ జీవో ప్రతులను మంటల్లో వేశామని పేర్కొన్నారు. నాకు సీఎం జగన్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, ఆయన తండ్రి, ఒకప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అయితే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం వల్లే జగన్‌ను విమర్శిస్తున్నామని, తనను ప్రజలతో కలవకుండా చేసేందుకే జీవో నెంబర్.1 తీసుకొచ్చారని ఆరోపించారు. ఇక తాను పాల్గొన్న సభల్లో పోలీసులు భద్రత కల్పించలేదని, ఆ తర్వాత జరిగిన తొక్కిసలాట ఘటనలను సాకుగా చూపించి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను కట్టడి చేయాలనీ చూస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 10 =