మునుగోడు ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తనపై కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ఫ్రచారం చేస్తున్నారని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె కొన్ని ఆధారాలను సమర్పించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఈఓ వికాస్ రాజ్ ప్రస్తుతం వైరల్ అవుతున్న లింకుల ద్వారా దర్యాప్తు ప్రారంభిస్తామని, దీనికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా దీనిపై మండిపడ్డారు. ‘దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది.
కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు#ManaMunugodeManaCongress #MunugodeWithCongress
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE