ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ) చైర్మన్ గా నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ నియామకం యొక్క నిబంధనలు మరియు కండిషన్స్ విడిగా జారీ చేయబడతాయని తెలిపారు. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పోసాని చాలాకాలంగా వైఎస్సార్సీపీ పార్టీలో ఉంటూ, ప్రభుత్వ నిర్ణయాలకు, విధానాలకు బహిరంగంగానే మద్ధతు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోసానికి కీలక పదవీ ఇవ్వబోతున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవీ దక్కింది. మరోవైపు ఇటీవలే ప్రముఖ హాస్య నటుడు అలీని కూడా ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. వైఎస్సార్సీపీకి చాలాకాలంగా సేవలు అందిస్తున్న తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఈ ఇద్దరూ ప్రముఖులకు వెంటవెంటనే పదవులు దక్కాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE