సీఎం కేసీఆర్ ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Munugode MLA Kusukuntla Prabhakar Reddy Meets CM KCR at Pragatibhavan Today,Munugode MLA Kusukuntla Prabhakar Reddy, Prabhakar Reddy Meets CM KCR,CM KCR Pragatibhavan Meeting,Mango News,Mango News Telugu,CR Latest News And Live Updates,TRS Party, BRS Party , Telangana Minister KTR,MLA Kusukuntla Prabhakar Reddy, Telangana CM KCR, Telangana Rashtra Samithi, Telangana BJP Party, TRS Won in Munugode

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశమిచ్చి, తన విజయానికి కారణమైనందుకు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కృతజ్జతలు తెలిపారు. అనంతరం కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, ఆయనను శాలువాతో సత్కరించి, దీవించారు.

అలాగే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు పూనుకోవాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =