బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ ఫిబ్రవరి 14న నోటీసులు పంపింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జాతీయ మహిళా కమిషన్ ఈ నోటీసులు పంపగా, ఫిబ్రవరి 21న కమిషన్ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.
“తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్పై మీరు చేసిన అవమానకరమైన వ్యాఖ్యను జాతీయ మహిళా కమిషన్ సుమోటో/స్వయంచాలకంగా స్వీకరించింది. ఈ వ్యాఖ్య ఆమె గౌరవాన్ని కించపరిచేలా ఉంది. ఇప్పుడు పైన పేర్కొన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషన్ ఈ విషయంలో విచారణను 2023, ఫిబ్రవరి 21న ఉదయం 11:30 గంటలకు షెడ్యూల్ చేసింది. పేర్కొన్న తేదీ మరియు సమయంలో వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరు కావాలి” అని నోటీసులో జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE