తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని టీఎస్పీఎస్సీ మంగళవారం నాడు ఖరారు చేసింది. అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటన చేసింది. ముందుగా ఈ గ్రూప్-1 పోస్టుల కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
ముందుగా ప్రిలిమ్స్ పరీక్షను జూలై/ఆగస్టు 2022లో నిర్వహించాలని భావించగా, విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఇతర పలు పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న తేదీలపై టీఎస్పీఎస్సీ మంగళవారం సమావేశం నిర్వహించింది. సమావేశం అనంతరం అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. నిర్ణీత సమయంలో పరీక్షా కేంద్రాలు, హాల్ టికెట్స్ డౌన్ లోడ్ వివరాలను అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అలాగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను జనవరి/ఫిబ్రవరి 2023 లో నిర్వహించే అవకాశాలున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY