హైదరాబాద్ నుంచి నేరుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త అందింది. నగరంలోని శంషాబాద్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరలో అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు నడవనున్నాయి. ఎయిర్ ఇండియా హైదరాబాద్ నుంచి అమెరికాలోని చికాగోకు నాన్స్టాప్ గా విమానాలు నడిపేందుకు సిద్దమవుతుంది. జనవరి 15వ తేదీ నుంచి హైదరాబాద్-చికాగోకు సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయాణకులు ఇతర విమానాశ్రయాల కనెక్టింగ్తో కూడిన విమాన సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. నగరం నుంచి అమెరికాకు నేరుగా విమానాలు నడపాలని ప్రయాణికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుండగా త్వరలోనే వారి నిరీక్షణకు తెరపడనుంది. కాగా ప్రారంభం తేదీ, వారానికి ఎన్ని సార్లు నడుపుతారు ఇతర సంబంధిత విషయాలపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ