ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు. ఈ పరీక్షలు ఏపీలో 13 జిల్లాలతో పాటుగా హైదరాబాద్ కేంద్రంలో జరగనుండగా మెయిన్స్కు అర్హత సాధించిన మొత్తం 9,678 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
ఇక ప్రశ్నపత్రం ఇంగ్లీష్/తెలుగు వెర్షన్ లలో టాబ్ ద్వారా అందించబడుతుందని చెప్పారు. ట్యాబ్ ద్వారా పరీక్ష రాసే విధానానికి సంబంధిన డెమో వీడియోను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ (https://psc.ap.gov.in/) లో అందుబాటులో ఉంచారు. కరోనా నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. ముందుగా మెయిన్స్ పరీక్షలను నవంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించేలా ఏపీపీఎస్సీ నిర్ణయించగా, హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. అయితే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను బుధవారం నాడు హైకోర్టు కొట్టివేయడంతో సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి యధావిధంగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్:
- 14.12.2020 – తెలుగు (క్వాలిఫయింగ్ పేపర్)
- 15.12.2020 – ఇంగ్లీష్ (క్వాలిఫయింగ్ పేపర్)
- 16.12.2020 – పేపర్-I
- 17.12.2020 – పేపర్-II
- 18.12.2020 – పేపర్-III
- 19.12.2020 – పేపర్-IV
- 20.12.2020 – పేపర్-V
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ