తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం సిద్ధమవుతునట్టు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీకి మరో వారం రోజుల్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా, 2,000 లకు పైగా పంచాయితీల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేలు జీతం చెల్లిస్తుంది. పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉండడంతో, ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొంత ఊరట కలగనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]