తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 592 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 7, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 8,04,529 కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 331, రంగారెడ్డిలో 60, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 45, ఖమ్మంలో 17, నల్గొండలో 11, భద్రాద్రి కొత్తగూడెంలో 11 నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 477 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,95,421 కు చేరుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జూలై 7, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,57,86,975
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 8,04,529
- కొత్తగా నమోదైన కేసులు : 592
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,95,421
- కరోనా రికవరీ రేటు: 98.87%
- యాక్టీవ్ కేసులు: 4,997
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
- కరోనా మరణాల రేటు: 0.51%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY