కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. ఇది ఎవరినీ వదలడంలేదు. తాజాగా, హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కరోనా లక్షణాలున్న వారికి ఆస్పత్రి అధికారులు టెస్టులు చేస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని ఐసొలేషలో ఉంచుతున్నామన్నారు. అసలే మానసిక రోగులు కావడంతో.. సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు. సేకరించిన నమూనాలను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం పంపించినట్లు తెలిపారు. అత్యవసర సేవల కోసం అన్నీ సిద్ధంచేసి ఉంచామని చెప్పారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చికిత్సను అందించనున్నామని తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ