తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జనవరి 29న సంబంధిత అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటీసు విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే ఫిబ్రవరి 15న పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోగా సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సంబంధించిన 906 పీఏసీఎస్ లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అడిషనల్ రిజిస్ట్రార్ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పీఏసీఎస్ చైర్మన్లు అందరూ కలిసి డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.
పీఏసీఎస్ ఎన్నికలను షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ: 30-01-2020
- ఎలక్షన్ నోటిస్ జారీ : 03-02-2020
- నామినేషన్ల స్వీకరణ: 06-02-2020 నుంచి 08-02-2020
- నామినేషన పరిశీలన: 09-02-2020
- నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా: 10-02-2020
- పోలింగ్ తేదీ: 15-02-2020
- ఓట్ల లెక్కింపు తేదీ: 15-02-2020
- పలితాలు ప్రకటన: 15-02-2020
- సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక: ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లో ఎంపిక.
[subscribe]