దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులగా ప్రతిరోజూ 40 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,322 కేసులు నమోదు కావడంతో నవంబర్ 28, శనివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 93,51,109 కు చేరుకుంది. కరోనాతో మరో 485 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,36,200 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 87 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 41,452 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 87,59,969 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.68 శాతం గానూ, మరణాల రేటు 1.46 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 4,54,940 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, మరియు ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 41,322 కేసులలో 69.04 శాతం ఈ రాష్ట్రాలలో నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ