ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం నాడు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ను ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించనున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో కలిపి దేశంలో ఇప్పటికి 8 వందే భారత్ ఎక్స్ప్రెస్ లు పట్టాలెక్కినట్టు అవుతుంది. “తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి కానుక, రెండు రాష్ట్రాలలో రైలు కనెక్టివిటీకి ఒక పెద్ద ఊపు రానుంది. ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జనవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు 8వ వందే భారత్ రైలును వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభిస్తారు” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ రైల్ లో హాల్టింగ్ స్టేషన్లుగా వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE