రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ త్వరలో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో గడపనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూల్ను ఖరారు చేశారు. రాష్ట్రపతి సదరన్ సోజర్న్ సెప్టెంబర్ 29 నుండి జనవరి 3, 2022 వరకు జరుగుతుంది. సికింద్రాబాద్ బొల్లారంలోని రెసిడెన్సీ హౌస్ లో బస చేయనున్నారు. రాష్ట్రపతి నూతన సంవత్సర వేడుకలను ఇక్కడే నిర్వహించనున్నారు. దీనిపై ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా బొల్లారం రాష్ట్రపతి నిలయం వద్ద సెక్యూరిటీ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రపతిగా దక్షిణాదిలో రామ్నాథ్ కోవింద్కు ఇదే చివరి శీతాకాల విడిది. ఎందుకంటే, భారత రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ పదవీకాలం జూన్ 14, 2022తో ముగుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ