పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ క్రమంలో తాజాగా పంజాబ్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ బుధవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనంతరం మన్ ప్రీత్ సింగ్ బాదల్ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, తరుణ్ ఛుగ్ సహా పలువురు నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మన్ ప్రీత్ సింగ్ బాదల్ కు పీయూష్ గోయల్ పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు.
ఏడేళ్ల క్రితం తన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ను మన్ ప్రీత్ సింగ్ బాదల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండి, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ లో ప్రారంభ ఉత్సాహం క్రమంగా నిరాశా నిస్పృహలకు దారితీసిందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని కొంతమంది వ్యక్తులతో కూడిన కోటరీ పంజాబ్ లో వ్యవహారాలను నడుపుతోందని మన్ ప్రీత్ సింగ్ బాదల్ విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE