తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఘటనకు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధ్యులైన ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై తెలంగాణ పోలీస్శాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్, పీ జానయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో వీరూ ఇప్పటికే సస్పెన్షన్ లో ఉండగా, విచారణ అనంతరం తాజాగా విధుల నుంచి పూర్తిగా తొలగిస్తునట్టు ఆదేశాలు ఇచ్చారు. అలాగే సస్పెన్షన్ ఆదేశాలు జూలై 20, మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ