ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ

RJD Leader Tejashwi Yadav Meets Telangana CM KCR In Pragathi Bhavan Hyderabad, RJD Leader, Tejashwi Yadav, Telangana CM KCR, Pragathi Bhavan, Pragathi Bhavan Latest News, Pragathi Bhavan Live Updates, CM KCR, Bihar Leader of Opposition Tejaswi Yadav, Bihar Leader of Opposition Tejaswi Yadav Meets CM KCR, Tejaswi Yadav meets CM KCR, RJD Leader Tejashwi Yadav, Tejashwi Yadav Meets Telangana CM KCR, Tejashwi Yadav Meets CM KCR, Mango News, Mango News Telugu,

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వి యాదవ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న వీరిద్దరి భేటీ సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. దేశంలో.. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, థర్డ్‌ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్‌తో తేజస్వి మంతనాలు సాగించనున్నారు. బీజేపీ ఇటీవల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. లెఫ్ట్‌ పార్టీల జాతీయ నేతలతో సీఎం కేసీఆర్‌ ఈ మధ్యే చర్చలు జరిపారు. తేజస్వి యాదవ్‌ బృందంలో.. సమాజ్ వాదీ పార్టీ నేతలు అబ్దుల్ సిద్దిఖీ, సునీల్ సింగ్ ఉన్నారు.

ప్రస్తుతం బీహార్ విపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. తండ్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేసుల కారణంగా జైలు పాలవడం, వృద్ధాప్యం కారణంగా ప్రస్తుత బీహార్ రాజకీయాలలో అంత క్రియాశీలంగా ఉండటం లేదు. పార్టీ కార్యకలాపాలన్నీ తేజస్వీ యాదవే చూసుకుంటున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జేడీయూ పార్టీలకు ధీటుగా ఆర్జేడీ నిలవడంతో తేజస్వీ కీలక పాత్ర పోషించాడు. కాగా, తేజస్వీ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించటంలో ముందుంటున్నాడు. ఈ నేపథ్యంలో సీఎం కెసిఆర్, తేజస్వీ యాదవ్ కలయిక సంచలనమవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =