కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సుమారు 45 రోజులుకు పైగా ఆర్టీఏ కార్యకలాపాలు నిలిపివేయబడ్డ సంగతి తెలిసిందే. లాక్డౌన్ 3.0 లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రిజిస్ట్రేషన్, రవాణా కార్యాలయాలు తెరవడానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో మే 7, గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ కార్యకలాపాలు(ఆర్టీఏ) ప్రారంభమయ్యాయి. ముందుగా ఆన్లైన్లో పరిమిత సంఖ్యలో స్లాట్లు బుకింగ్ కు అనుమతి నిచ్చారు.
వాహనాల రిజిస్ట్రేషన్లు, లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, తదితర సేవలు వినియోగదారులుకు అందుబాటులోకి వచ్చాయి. లాక్డౌన్ విధించక ముందు స్లాట్ లు నమోదు చేసుకున్న వారికీ వచ్చే వారం రోజుల్లోగా దశలవారీగా సేవలను అందించనున్నట్టు తెలిపారు. తప్పనిసరిగా మాస్కు ధరించిన వారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. కచ్చితమైన భౌతిక దూరం పాటించాలని సూచించారు. అన్ని ఆర్టీఏ కార్యాలయాల బయట, వచ్చే వినియోగదారులకు థర్మల్ స్కానింగ్ చేసేందులు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu