తెలంగాణలో రైతులకు యాసంగి సీజన్ కు సంబంధించి రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 11, బుధవారం) జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. నేడు 2,49,969 మంది రైతుల ఖాతాల్లోకి రూ.564.08 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. 11 లక్షల 28 వేల 184.38 ఎకరాలకు నిధులు విడుదల జరిగిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 59 లక్షల 08 వేల 453 మంది రైతుల ఖాతాలలో రూ.5318.73 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్టు తెలిపారు.
వ్యవసాయరంగమే భారత్ ను ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలబెడుతుందని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యధిక శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని, కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం విచారకరమని అన్నారు. “ప్రపంచంలో అత్యధిక యువశక్తి అందుబాటులో ఉన్న దేశం భారతదేశం. ప్రపంచానికి ఆహారం అందించే వ్యవసాయరంగం వైపు యువతను మళ్లించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యవసాయరంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారు. వినూత్న పథకాలతో వ్యవసాయరంగానికి ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టారు సీఎం కేసీఆర్ వ్యవసాయ విధానాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి” అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE