హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2 నుంచి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న (1వ రోజు) బంగారు రామానుజ స్వామికి అభిషేకం, విష్ణు సహస్రనామస్థోత్ర సామూహిక పఠనం, ఫిబ్రవరి 3న (2వ రోజు) దివ్యసకేతం నుండి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరకు సాకేత రాముని ఊరేగింపు, యాగం ప్రారంభం, ఫిబ్రవరి 4న (3వ రోజు) రామానుజ నూత్తందాది సామూహిక పారాయణ, ఎదురుకోలు (పెళ్లికి ముందు తయారీ) మరియు 18 గరుడవాహనాలపై 18 దివ్యదేశాధీశుల ఊరేగింపు, ఫిబ్రవరి 5న (4వ రోజు) అన్ని 108 దివ్యదేశాల శాంతి కళ్యాణం (వివాహ ఆచారాలు), ఫిబ్రవరి 6న (5వ రోజు) వసంతోత్సవం మరియు ఊరేగింపు, ఫిబ్రవరి 7న (6వ రోజు) డోలోత్సవం లేదా ఊయల వేడుక, ఊరేగింపును ఘనంగా నిర్వహించారు
అలాగే ఫిబ్రవరి 8న (7వ రోజు) లక్ష్మీ నారాయణ పూజ, భగవద్గీత అవధానం మరియు తెప్పోత్సవం, ఫిబ్రవరి 9న (8వ రోజు) బంగారు రామానుజ స్వామికి ఆచార్య వరివస్య, విష్ణు సహస్రనామస్థోత్ర సామూహిక పఠనం, ఫిబ్రవరి 10న (9వ రోజు) సామూహిక ఉపనయనాలు మరియు సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ, 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు, ఇక ఫిబ్రవరి 11న (10వ రోజు) రథోత్సవం, భగవద్గీత సామూహిక పఠనం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తజన సందోహం తరలివచ్చారు.
కాగా ఫిబ్రవరి 12, ఆదివారం మహా పూర్ణాహుతిలో భాగంగా యజ్ఞం యొక్క హోమ కుండాలలో చివరి ఆహుతి చూసేందుకు చివరి రోజుని అని తెలిపారు. ఆదివారం రోజువారీ షెడ్యూల్ కార్యక్రమాలతో పాటుగా, ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసనము, మహాపూర్ణావుతి, ధ్వజావారోహణం, కుంభప్రోక్షణ, తీర్థ, ప్రసాద గోష్ఠి వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మరోవైపు ఫిబ్రవరి 2న ప్రారంభమైన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 14వ తేదీతో ముగియనున్నాయి.
సమతా కుంభ్-2023: 11వ రోజు (ఫిబ్రవరి 12, ఆదివారం) రోజువారీ షెడ్యూల్:
- ఉదయం 5.45 గంటలకు: సుప్రభాతం
- 6-630: అష్టాక్షరి మంత్రంతో ధ్యానం
- 6.30-7.30 ఆరాధన, సేవా కాలం
- 7.30-9: శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్టి
- 9-10గంటలు వరకు: రోజువారీ పూర్ణాహుతి, బలిహరణ.
ఫిబ్రవరి 12, ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు:
- ఉదయం 9 గంటలకు: సాకేత రామచంద్ర ప్రభువుకు దివ్యసాకేత క్షేత్రంలో ఉత్సవాస్త స్నపనము
- మధ్యాహ్నం 3 గంట నుండి ప్రత్యేక వేదికపై –
–>ద్వాదశారాధన
–>శ్రీ పుష్పయాగం
–>దేవతోద్వాసనము
–>మహాపూర్ణావుతి
–>ధ్వజావారోహణం
–>కుంభప్రోక్షణ
–>తీర్థ, ప్రసాద గోష్ఠి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE