ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు డోలోత్సవం కనులపండుగగా జరిగింది. అలాగే ఏడో రోజూ (ఫిబ్రవరి 8, బుధవారం) సాయంత్రం 4.30 గంటల నుంచి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. సమతామూర్తి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ముందుగా బుధవారం ఉదయం 11.30 గంటలకు శ్రీ చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో కల్హారోత్సవం, సామూహిక పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఇక బుధవారం సాయంత్రం క్షీర సాగర శయనునికి, సర్వభూత భావనుకి, విశాల నేత్రునికి, లీలా విహారికి, 18 రూపాలలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ చిన్నజీయర్ స్వామీజీ పర్యవేక్షణలో 18 దివ్యదేశాధీశులకు 18 రూపాలలో తెప్పోత్సవం జరిగింది. మరోవైపు రేపు (ఫిబ్రవరి 11, శనివారం) మధ్యాహ్నం 1 గంటకు సమతా మూర్తి స్ఫూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రంలో విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం (భగవద్గీత పారాయణం) కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సమతా కుంభ్-2023: ఫిబ్రవరి 10, శుక్రవారం కార్యక్రమాల వివరాలు:
- ఉదయం 9.30 గంటలకు: ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయనములు
- సాయంత్రం 6.30-8.30 గంటలకు: సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ, 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE