రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ రెండో బ్యాచ్ ఆదివారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యా నుంచి ప్రత్యేక విమానంలో 60 వేల స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ డోసులు హైదరాబాద్ కు చేరుకున్నాయి. కాగా మొదటి బ్యాచ్ కింద ఇప్పటికే 1.5 లక్షల డోసులు మే 1న హైదరాబాద్ కు చేరిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా కోవాక్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ల పంపిణీ ఇప్పటికే జరుగుతుండగా ఇటీవలే స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ అనుమతి ఇచ్చింది. విదేశంలో తయారై దేశంలో వినియోగించబోయే తోలి కరోనా వ్యాక్సిన్ గా స్పుత్నిక్-వీ నిలిచింది.
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో ఉత్పత్తి, అమ్మకాలపై రష్యా ఆర్డీఐఎఫ్ తో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసుకు ప్రస్తుతం రూ.948+ 5 శాతం జీఎస్టీతో కలిపి ధర రూ.995.40 గా నిర్ణయించినట్టు ఇటీవలే డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రకటించింది. అలాగే దేశంలో స్పుత్నిక్-వీ సాఫ్ట్ లాంచ్లో భాగంగా మొదటి డోసు పంపిణీ కార్యక్రమాన్ని కూడా డాక్టర్ రెడ్డీస్ సంస్థ మే 14, శుక్రవారం నాడు హైదరాబాద్ లో ప్రారంభించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ