మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. ఎంపీ రాజీవ్ సతావ్ కి గత ఏప్రిల్ 22న కరోనా పాజిటివ్ గా తేలడంతో పూణేలోని జహంగీర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయి కోలుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం మళ్ళీ క్షిణించింది. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. రాజీవ్ సతావ్ కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు నిర్వర్తించారు.
2014 ఎన్నికల్లో మహారాష్ట్రలోని హింగోలి నుండి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. గుజరాత్ రాష్ట్రానికి ఏఐసీసీ ఇన్ఛార్జి గా కూడా పనిచేశారు. అలాగే ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి రాజీవ్ సతావ్ దగ్గర సహచరుడిగా ఉండేవారు. రాజీవ్ సతావ్ మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ