తెలంగాణ రాష్ట్రంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మార్చి 1, సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. సోమవారం నాడు మొత్తం 93 కేంద్రాల్లో (ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు) 4,558 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,00,399 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, మొత్తం 1, 47,716 మంది లబ్ధిదారులకు రెండవ డోసు వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లేదా స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా కరోనా వ్యాక్సిన్ వేయబడుతుందని తెలిపారు.
తెలంగాణలో మార్చి 1 న కరోనా వ్యాక్సినేషన్ వివరాలు(8 PM వరకు):
- 60 ఏళ్లు పైబడినవారు, కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు):
–> 48 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు: 2005
–> 45 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు: 2553 - హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 249
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 70
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 51
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 16
తెలంగాణలో మార్చి 1 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,98,144
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,47,700
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 97,697
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 16
- 60 ఏళ్లు పైబడినవారు, కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 4,558
- మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 4,48,115
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ