సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నామని ఇటీవలే సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా 372 ఉద్యోగాలకు సింగరేణి సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 కేటగిరీల్లో 372 పోస్టులు భర్తీ చేయనుండగా, వీటిలో 305 పోస్టులను లోకల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.
సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ 305 పోస్టులకు అర్హులు. అలాగే మిగిలిన 67 అన్ రిజర్వ్డ్ పోస్టులకు తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సింగరేణి అధికారిక వెబ్ సైట్ www.scclmines.com లో జనవరి 22, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫిబ్రవరి 4, గురువారం 5 గంటల వరకు అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్ ద్వారా రూ.200 ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
సింగరేణిలో భర్తీ చేయనున్న 372 ఉద్యోగాల వివరాలు:
- ఫిట్టర్లు-128
- ఎలక్ట్రిషీయన్లు టైనీలు-51
- వెల్డర్ ట్రైనీలు-54
- టర్నర్/ మెషినిస్టు ట్రైనీలు-22
- మోటర్ మెకానిక్ ట్రైనీలు-14
- మౌల్డర్ ట్రైనీలు-19
- జూనియర్ స్టాఫ్ నర్స్-84
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ