జమ్మూ కశ్మీర్‍ లో ఉగ్రవాదుల కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాను వీరమరణం

Soldier Ryada Mahesh From Telangana Martyred During Anti-terror Operation at Jammu Kashmir

జమ్మూ కశ్మీర్‌ లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టారు లైన్ అఫ్ కంట్రోల్ వద్ద జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు, ఒక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ వీరమరణం పొందారు. ఈ కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్‌‌ వీరమరణం పొందారు. ఆర్మీ అధికారులు అధికారికంగా ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చిన్న వయసులోనే ర్యాడా మహేష్‌ వీరమరణం పొందడంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వీరమరణం పొందిన ర్యాడా మహేష్‌‌ కు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. దేశం కోసం మ‌హేశ్ చేసిన త్యాగం మ‌రువ‌లేనిదన్నారు. మ‌హేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని భ‌రోసానిచ్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మహేష్ వీరమరణంపై స్పందిస్తూ “మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు, మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేము” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 2 =