దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 11 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. ఫిబ్రవరి 5, బుధవారం నాడు రైల్ నిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైల్వే బడ్జెట్ కేటాయింపులను వివరించారు. గత బడ్జెట్ కంటే 3 శాతం ఎక్కువ మొత్తంలో రైల్వే శాఖకు రూ.1.61 లక్షల కోట్లను కేంద్రం కేటాయించిందని చెప్పారు. ఈ బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్కు రూ.170 కోట్లు కేటాయించారని చెప్పారు. అలాగే ఔరంగాబాద్-పన్వెలి, గుంటూరు-లింగంపల్లి, చర్లపల్లి-శ్రీకాకుళం మార్గాలలో తేజస్ రైళ్లు తీసుకొచ్చే అవకాశముందని పేర్కొన్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని పలు ప్రాజెక్టులకు, కొత్త లైన్లకు జరిగిన కేటాయింపులను జీఎం గజానన్ మాల్యా మీడియాకు వివరించారు.
ప్రైవేట్ రైళ్లు నడిపించే 11 మార్గాలు:
- చర్లపల్లి-వారణాసి
- లింగంపల్లి-తిరుపతి
- చర్లపల్లి-పర్వేలి
- విజయవాడ-విశాఖపట్టణం
- చర్లపల్లి-శాలిమార్
- ఔరంగబాద్-పన్వెలి
- సికింద్రాబాద్-గౌహతి
- చర్లపల్లి-చెన్నై
- గుంటూరు-లింగంపల్లి
[subscribe]