రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ కరోనా వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. హైరిస్క్ గ్రూపు/నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన వారికీ మే 28 నుండి పది రోజుల పాటు వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సినేషన్ కోసం 30 సర్కిళ్లలో విస్తృత ఏర్పాట్లను చేపట్టారు. ముందుగానే గుర్తించిన వారికి ప్రత్యేక టోకెన్లను గురువారం నాడే అందచేసి వారికి ఇచ్చే వాక్సినేషన్ సమయాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమం కోవిడ్ నిబంధనలతో సజావుగా సాగింది.
కాగా నగరంలో చేపట్టిన ఈ ప్రత్యేక వాక్సినేషన్ ప్రక్రియను పలువురు ప్రజాప్రతినిధులు స్వయంగా పరిశీలించారు. నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హైదరాబాద్ పార్ల మెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తమ పరిధిలోని వాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
నగర మేయర్ గద్వాల విజయలక్మ్షి బంజారాహిల్స్ వాక్సినేషన్ సెంటర్ తో పాటు సనత్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సెంటర్లను పరిశీలించారు. డిప్యూటి మేయర్ మోతె శ్రీలత సికింద్రాబాద్ సర్కిల్ లోని పలు కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు కేంద్రాలను మేయర్ గద్వాల్ విజయలక్మ్షి, కమిషనర్ లోకేష్ కుమార్ లతో కలిసి సందర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, దిల్ సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పక్కన ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గోషామహల్ సర్కిల్ లోని రెడ్ రోస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు కేంద్రాన్ని, అలాగే ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. డిప్యూటి స్పీకర్ పద్మారావు సీతాఫల్ మండి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసి ఫలక్ నూమా సర్కిల్ లోని పలు కేంద్రాలను పరిశీలించారు. ఎమ్మెల్సీలు షంబీపూరి రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పాషా ఖాద్రీ, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ తదితర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ