తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్శీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. క్షేత్రంలోని బాలాలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. యాదగిరి ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరపటం ఆనవాయితీ. ఈ 11 రోజుల పాటు ముక్కోటి దేవతలు ఇక్కడ కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా సకల దేవతలకు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలకటం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం.
విశ్వక్సేన పూజలతో మొదలయ్యే ఉత్సవాలు చివరి రోజున అష్టోత్తర శతఘటాభిషేకంతో సమాప్తం అవుతాయి. ఈ ఉత్సవాలలో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర వంటి అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తారు. పదోరోజున చక్రతీర్థ స్నానం నిర్వహిస్తారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలనుంచి కూడా భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరవుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సకల వసతులతో ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించటానికి సీఎం కేసీఆర్ చొరవచూపటం తెలిసిందే. విశేషంగా తరలి రానున్న భక్త జనం కోసం ఆలయ కమిటీ మరియు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ