దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 6,396 కరోనా కేసులు, 201 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,51,556 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,14,589 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 13,450 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,23,67,070 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.64 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 69,897 (0.16%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (మార్చి 3 (8am)–మార్చి 4 (8am)):
- కేరళ – 2,222
- మిజోరాం – 569
- మహారాష్ట్ర – 467
- కర్ణాటక – 382
- ఢిల్లీ – 326
- తమిళనాడు – 292
- ఉత్తర్ ప్రదేశ్ – 258
- రాజస్థాన్ – 256
- హర్యానా – 254
- తెలంగాణ – 164
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ