హైదరాబాద్ నగరశివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో రేపు (మార్చి 22, బుధవారం) ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుభప్రదమైన ఉగాది పండుగ జరుపుకునేందుకు భక్తులకు, ప్రజలందరికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్వాగతం పలుకుతుంది. తెలుగు నూతన సంవత్సరాన్ని జరుపుకోవాడానికి, శ్రీ భగవద్ రామానుజుచార్య వారి మరియు 108 దివ్యదేశాల దేవతలు దైవానుగ్రహం పొంది, ఒక ప్రత్యేక అద్భుతమైన సంవత్సరానికి నాంది పలికేందుకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించాలని కోరారు. సాధారణంగా ప్రతివారంలో బుధవారం నాడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శనకు భక్తుల ప్రవేశాలకు అనుమతి ఉండదు. అయితే మార్చి 22, బుధవారం నాడు ఉగాది సందర్భంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. భక్తులు, ప్రజలు ప్రవేశాల కోసం తమ ఎంట్రీ పాస్ లను http://entrypass.statueofequality.org లింక్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE