సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ రాజ్భవన్ అతిథిగృహంలో మూడు రోజులపాటు బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 14న యాదాద్రిని సందర్శించి, లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోనున్నారు. సీజేఐతో పాటుగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా యాదాద్రికి వెళ్లనున్నారు. అలాగే యాదాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. సీజేఐ, గవర్నర్, సీఎం పర్యటన నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు యాదాద్రి ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ