మూడు చింతలపల్లి గ్రామంలో కాంగ్రెస్ 48 గంటల దళిత-గిరిజన ఆత్మగౌరవ దీక్ష

Congress deeksha for cause of SCs and STs in Telangana, Congress’ Dalita Dandora, Dalit-Girijana Atma Gourava Deeksha, Dalita Girijana Dandora Sabha, Dalitha Girijana Atma Gourava, Mango News, Muduchintalapalli Village, Muduchintalapalli Village of Medchal District, Revanth Reddy, T-Congress 48 Hour Dalit-Girijana Atma Gourava Deeksha Started, T-Congress 48 Hour Dalit-Girijana Atma Gourava Deeksha Started At Muduchintalapalli Village

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ భారీగా నిర్వహించగా, ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో రెండో దండోరా సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాజాగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లిలో మంగళవారం ఉదయం 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఈ దీక్ష బుధవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ 48 గంటల దీక్షలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా మూడు చింతలపల్లిలో దీక్షా శిబిరం వరకు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా తరలివచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + fourteen =