ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీయట్ అడ్మిషన్స్ (ప్రవేశాలు) ఆన్లైన్ విధానం ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ తోలి దశ ఆన్లైన్ అడ్మిషన్స్ (ప్రవేశాలకు) ను ఆగస్టు 13 నుంచి ప్రారంభించారు. ముందుగా ఆగస్టు 23, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. కాగా ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్స్ నమోదు గడువును పొడిగిస్తునట్టు తాజాగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 27, సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. https ://bie.ap.gov.in వెబ్ సైట్లో అన్ని వివరాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు కోసం ఫీజు కింద ఎస్సీ/ఎస్టీ/పీహెఛ్ విద్యార్థులు రూ.50, ఓసీ/బీసీ విద్యార్థులు రూ.1000 చెల్లించాలని తెలిపారు. విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు ఈ అడ్మిషన్స్ ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే 24/7 టోల్ ఫ్రీ నెంబర్ 18002749868 ను సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ వి.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ