తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. బుధవారం ఢిల్లీలో ఖర్గేను కలుసుకున్న వెంకట్ రెడ్డి, ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆయన ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది. దీనిని గురించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా ఏఐసీసీ ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు కల్పించలేదు. తనతో పాటు ఇతర సీనియర్లకు ఈ కమిటీల్లో చోటు దక్కని విషయాన్ని ఆయన ఖర్గేకు వివరించినట్లు సమాచారం. దీనికి ఖర్గే స్పందిస్తూ.. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని కోమటిరెడ్డికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు @kharge మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, సీనియర్లు పార్టీని వీడుతుండడంపై చర్చించాను. అరగంటపాటు సమయం ఇచ్చి ఖర్గే గారు అంతా విన్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని వారు చెప్పడం జరిగింది. pic.twitter.com/Huf47JzU1O
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 14, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ