ఏపీ అయినా, తెలంగాణ అయినా తెలుగువారి క్షేమం కోరే పార్టీ టీడీపీ – చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ అయినా.. తెలంగాణ అయినా.. తెలుగువారందరి క్షేమం కోరే పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ ఇప్పటినుంచే సమాయత్తమవుతోంది. ఇక జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీకి గల ఓటు బ్యాంకు ప్రధాన పార్టీల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కూసుమంచి మండలంలో టీడీపీ అధినేతకు ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కేశవాపురం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని, 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ వేదికగా ఆయన టీడీపీని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాల మేరకు టీడీపీ అప్పటినుంచి ఇప్పటివరకు ప్రజాసేవకే అంకితమైందని తెలిపారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో టీడీపీ బలమైన పాత్ర పోషించిందని, హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో నిలిచిందంటే దానికి ప్రధాన కారణం టీడీపీయేనని స్పష్టం చేశారు. తాను అధికారంలో ఉండగా ఐటీ అభివృద్ధికి కృషి చేశానని, ఇప్పుడు ప్రపంచస్థాయి సంస్థలు ఎన్నో ఇక్కడ కొలువుదీరాయని వివరించారు. ఇక ఏ రాష్ట్రంలో ఉన్నా తాను ప్రజల అభిమానాన్ని గుర్తుంచుకుంటానని చంద్రబాబు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =