తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2319 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 12, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,00,094 కి చేరింది. కరోనా వలన మరో ఇద్దరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,047కి పెరిగింది. అలాగే మరో 474 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,77,708కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1275, మేడ్చల్ మల్కాజిగిరిలో 234, రంగారెడ్డిలో 173 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జనవరి 12, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,03,67,759
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,00,094
- కొత్తగా నమోదైన కేసులు : 2319
- కొత్తగా నమోదైన మరణాలు : 2
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,77,708
- కరోనా రికవరీ రేటు: 96.80%
- యాక్టీవ్ కేసులు: 18,339
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,047
- కరోనా మరణాల రేటు: 0.57%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ