ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రికార్డు, మార్చిలోపు 1.2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ – మంత్రి నిరంజన్ రెడ్డి

Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Held Review on Oil Palm Cultivation,Telangana Agriculture Minister,Agriculture Minister Singireddy Niranjan Reddy,Agriculture Minister Niranjan Reddy,Held Review on Oil Palm Cultivation,Telangana Palm Cultivation,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

హైదరాబాద్ రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఆయిల్ పామ్ సాగుపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి విడుదల చేశారు. అలాగే కేవలం ఏడాదిలో దేశంలోని ఒక రాష్ట్రంలో 50 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటి తెలంగాణ రికార్డు సృష్టించిన నేపథ్యంలో కేక్ కట్ చేసి అధికారులు, కంపెనీలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. రాష్ట్రంలో మార్చిలోపు 1.2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు నమోదవుతుందని అన్నారు. 11 ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా 1502 ఎకరాలలో 38 ఆయిల్ పామ్ మొక్కల నర్సరీల ఏర్పాటు చేశామన్నారు. “కేవలం ఏడాదిలో 52 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటి తెలంగాణ రికార్డు సృష్టించింది. వచ్చే మూడు నెలలలో 70 వేల ఎకరాలలో మొక్కలు నాటడం పూర్తికావాలి. 2023-24 లో నాటేందుకు కోటి ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరో లక్ష 50 వేల ఎకరాలకు సరిపోతాయి. అలాగే ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్ ఫెడ్ ద్వారా 458 ఎకరాల భూమి సేకరణ జరిగింది” అని తెలిపారు.

“నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలలో ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ప్రీ యూనిక్, మ్యాట్రిక్స్ కంపెనీలకు టీఎస్ ఐఐసీ ద్వారా భూమి కేటాయింపుకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. మిగతా కంపెనీలకు ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు భూమి కేటాయించేందుకు ధరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు దృష్టిపెట్టాలి. కంపెనీలు గ్రామాల వారీగా అవగాహనా సమావేశాలు నిర్వహించాలి. రైతువేదికలలో శిక్షణలు ఇప్పించాలి. ఆయిల్ పామ్ మీద ఆదాయం వచ్చే వరకు రైతులు అంతర పంటలు వేసుకునేందుకు రైతులకు అవగాహన, చైతన్యం కల్పించాలి. కామారెడ్డి జిల్లా బొప్పాస్ పల్లి విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ రీసెర్చ్ గార్డెన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ క్షేత్రం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాల్ తుమ్మెద విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కల క్షేత్రాల ఏర్పాటు పరిశీలనకు అధికారులకు ఆదేశాలు ఇచ్చాం” అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆయిల్ ఫెడ్ సురేందర్, జేడీ సరోజిని, ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 14 =