తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు: పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం

Telangana Assembly Approves Panchayat Raj Act Amendment Bill,Telangana Assembly,Telangana Assembly Panchayat Raj Act,Telangana Panchayat Raj Act,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ జరుగుతుండగా నేటితో చర్చ ముగియనుంది. కాగా శనివారం సమావేశాల సందర్భంగా రెండు బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లును కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

రాష్ట్రంలోని భద్రాచలం మండలంలో 3, బూర్గంపాడు మండలంలో 2, కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒక గ్రామం కలిపి మొత్తం కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదిస్తూ, ఆ బిల్లును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో శనివారం ఈ సవరణ బిల్లుపై చర్చ జరిపి సభ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదంతో భద్రాచలంలో (భద్రాచలం, సీతారాంనగర్‌, శాంతినగర్‌), బూర్గంపాడులో (సారపాక, ఐటీసీ), కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రాజంపేట ఇకపై గ్రామపంచాయతీలుగా ఏర్పాటు కానున్నాయి. మరోవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =