తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగస్టు 24వ తేదీ నుండి హైదరాబాద్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి “ప్రజా సంగ్రామ యాత్ర” పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర ప్రారంభాన్ని తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ శనివారం రాత్రి మరణించారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పార్టీపరంగా మూడు రోజుల పాటుగా సంతాప దినాలు పాటించాలని ప్రకటించింది. దీంతో 24న ప్రారంభించాల్సిన పాదయాత్రను వాయిదా వేసినట్లు తెలంగాణ బీజేపీ ఆదివారం నాడు ప్రకటించింది. కాగా ఆగస్టు 28వ తేదీ ఉదయం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుండి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు కొనసాగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ