తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుడు లా గణేశన్ మణిపూర్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 10న మణిపూర్ గవర్నర్ గా నజ్మా హెప్తుల్లా పదవీ విరమణ అనంతరం ఆ స్థానం ఖాళీగా ఉండడంతో సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో లా గణేశన్ ను మణిపూర్ కొత్త గవర్నర్ గా నియమిస్తూ, ఆయన గవర్నర్ కార్యాలయ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. గవర్నర్ గా నియమితులైన లా గణేశన్ కు తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం ఎంకే స్టాలిన్, ఇతర రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ