‘వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేయడం తెలిసిన విషయమే. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని, మహిళలను కూడా అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైఎస్ షర్మిల క్యారవాన్ ను తెరాస కార్యకర్తలు తగలబెట్టడాన్ని ఖండిస్తున్నాను. మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేయడం, ఆమె వాహనాన్ని తగలబెట్టడం టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం’ అని బండి సంజయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి @realyssharmila గారి క్యారవాన్ ను తెరాస కార్యకర్తలు తగలబెట్టడాన్ని ఖండిస్తున్నాను.మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేయడం,ఆమె వాహనాన్ని తగలబెట్టడం కేసీఆర్ అరాచక పాలనకు నిదర్శనం.రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నది కేసీఆర్ & బ్యాచే
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 28, 2022
కాగా సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్టీపీకి చెందిన ప్రచార బ్యానర్లకు, వాహనానికి నిప్పు పెట్టడంతో పాటు బస్సుపై కిరోసిన్ పోసి అంటించారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఆ సమయంలో షర్మిల బస్సులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో శాంతిభద్రతల దృష్ట్యా షర్మిలను అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం పోలీసులు ప్రకటించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆమెను విడిచి పెట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE