అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో కాక రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్ను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తమ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని, మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం లేదా? అని బండి నిలదీశారు. అసలు సభ నడిపే అర్హత సీఎం కేసీఆర్కు లేదని, ముందు ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యుల హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తోందని, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సస్పెన్షన్ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY