తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 8126 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 24, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,95,232 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 3307 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 3,30,304 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 83.57 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 38 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1999 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.50 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 62,929 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1259, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 676, రంగారెడ్డిలో 591, నిజామాబాదులో 497, నల్గొండలో 346, ఖమ్మంలో 339, వరంగల్ అర్బన్ లో 334, మహబూబ్ నగర్ లో 306, సిద్ధిపేటలో 306 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ