తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు జాతీయ నాయకులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రులు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తదితరులు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రికి చేరుకున్నారు. ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వీరికి ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ముఖ్యమంత్రులకు వేదమంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆశీర్వచనం పలికారు. అలాగే స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేసి వారిని సత్కరించారు.
కాగా ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ (యూపీ) మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నేతలు పాల్గొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు యాదాద్రిలో దాదాపు 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక యాదాద్రి పర్యటన అనంతరం ముఖ్యమంత్రులు ఖమ్మం బయలుదేరి వెళ్తారు. అక్కడ ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ఆరంభించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE